ఎంజీబీఎస్(MGBS) నుంచి సూర్యాపేటకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. టికెట్లను జారీ చేసే టిమ్ మిషన్ తో పాటు.. కండక్టర్ మొబైల్ ఫోన్ కూడా దొంగిలించారు. ఆ ఘటన దిల్ సుఖ్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కండక్టర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఇలా ఉన్నాయి.