రుషికొండ ప్యాలెస్ భవనాల వినియోగంపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను సిద్ధం చేసింది. ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం..తాజాగా ఐదోసారి సమావేశమైంది. పలు అంశాలపై చర్చించింది. అనంతరం సమావేశాల్లో చర్చించిన అంశాలతో సీఎం చంద్రబాబుకు తుది నివేదిక అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను మంత్రి మండలి భేటీలో చర్చిస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.