ఏపీని మొంథా తుపాను ముప్పు వీడలేదు. కాకినాడ - మచిలీపట్నం మధ్య మొంథా తుపాను తీరం తాకింది. ఇక తుపాను నేపథ్యంలో బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే కాలేజీలకు సెలవు ఇచ్చారు. తుపాను నేపథ్యంలో ఇప్పటికే ముంపు ప్రాంతాలవాసులకు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.