ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదం ఇప్పుడు రాజకీయ విమర్శలకు తెరలేపింది. ఓవైపు టన్నెల్లో ఉన్న కార్మికులకు కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతుంటే.. ఇటు రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గురించి కేసీఆర్ గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎస్ఎల్బీసీ అనేది ఒక భయంకరమైన ప్రాజెక్టని.. 2016లోనే సీఎంగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.