SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఫిబ్రవరి 22న ప్రమాదం జరగ్గా.. అందులో 8 మంది చిక్కుకుపోయారు. టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ కేడవర్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లు తెలిసింది. TBM మెషీన్ ఎడమ పక్కన ఓ మృతదేహానికి సంబంధించిన చేయి కనిపించినట్లు తెలిసింది.