SLBC టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గత 15 రోజులుగా అందులో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అయినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్స్ మూడు అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. తాజాగా.. రెస్క్యూ పనులు పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్ రేపు రంగంలోకి రోబోలను దింపుతామని చెప్పారు.