తిరుపతి: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. కళ్లలో కారం కొట్టి, బంగారం చోరీ..

3 months ago 23
తిరుపతి జిల్లాలో పట్టపగలే నగల షాపులో దొంగతనం జరగటం కలకలం రేపింది. సూళ్లూరుపేటలోని శ్రీవెంకటేశ్వర జ్యువెలరీ షాపులో ఈ చోరీ జరిగింది. నగల షాపు వద్దకు కస్టమర్ తరహాలో వచ్చిన ఓ దొంగ.. డిజైన్లు చూపించమని నగల షాపు ఓనరును అడిగారు. దీంతో దుకాణం యజమాని డిజైన్లు చూపిస్తుండగా.. నగలషాపు ఓనర్‌ను మాటల్లోకి దింపిన దొంగ .. ఉన్నట్లుండి అతని కళ్లలో కారం కొట్టి బంగారం తీసుకుని ఉడాయించాడు. ఇదంతా షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డైంది.
Read Entire Article