తిరుపతి జిల్లాలో పట్టపగలే నగల షాపులో దొంగతనం జరగటం కలకలం రేపింది. సూళ్లూరుపేటలోని శ్రీవెంకటేశ్వర జ్యువెలరీ షాపులో ఈ చోరీ జరిగింది. నగల షాపు వద్దకు కస్టమర్ తరహాలో వచ్చిన ఓ దొంగ.. డిజైన్లు చూపించమని నగల షాపు ఓనరును అడిగారు. దీంతో దుకాణం యజమాని డిజైన్లు చూపిస్తుండగా.. నగలషాపు ఓనర్ను మాటల్లోకి దింపిన దొంగ .. ఉన్నట్లుండి అతని కళ్లలో కారం కొట్టి బంగారం తీసుకుని ఉడాయించాడు. ఇదంతా షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డైంది.