నాలుగు రోజులు గడిచిపోయాయి. అయినా SLBC టన్నెల్ యాక్సిడెంట్లో చిక్కుకున్న 8 మంది బాధితుల ఆచూకీ దొరకలేదు. వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. టన్నెల్ 13.85 కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకోగా.. రెస్క్యూ బృందాలు 13.7 కి.మీ వరకు చేరుకున్నాయి. చివరి 40 మీటర్లు అత్యంత సమస్యాత్మంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతుండగా.. మార్కోస్ టీం రంగంలోకి దిగుతోంది.