వీధి వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన పథకం అమలు చేస్తోంది. ఇప్పటికే నెల్లూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు శ్రీకాకుళంలోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు కింద అర్హులైన వీధి వ్యాపారులకు కంటైనర్ దుకాణాలు కేటాయిస్తారు. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. లాటరీ పద్ధతిలో వీటిని కేటాయిస్తారు.