హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడటానికి బాలు నిరాకరించారని.. అందుకే రవీంద్ర భారతి వంటి తెలంగాణ సాంస్కృతిక వేదిక వద్ద విగ్రహం పెట్టడం సరికాదని కవిత అన్నారు. తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టాలని ఆమె తేల్చిచెప్పారు. విగ్రహం ఏర్పాటు చేయడానికి వేరే చోటు చూసుకోవాలని సూచించారు.