సినీ నటి శ్రీరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే దానిపై శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పూసపాటిరేగ పోలీసులు శ్రీరెడ్డికి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు శ్రీరెడ్డి. అనంతరం మరోమారు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.