Andhra Pradesh Free Bus Implemented In Merged Mandals Also: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే, విలీన మండలాల్లో ఈ పథకం అమలు కాలేదు. దీనికి పరిష్కారంగా, ఏలూరు, అల్లూరి జిల్లాల పరిధిలోని ఏడు మండలాల ప్రజల కోసం ఆర్టీసీ అధికారులు బస్సు రూట్లను మార్చారు. భద్రాచలం వెళ్లే బస్సులను ఎటపాక వరకు పొడిగించడంతో ఇవి రాష్ట్ర సర్వీసులుగా మారాయి. దీని ద్వారా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.