ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొన్నారు. తొలుత శ్రీశైల భ్రమరాంభిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వమించారు. అనంతరం రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వాన్ని ప్రశంసించి, డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ ప్రగతిపై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనను విమర్శించి, రాయలసీమ అభివృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.