CPI leader Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు. మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆసక్తి కనబరిచి.. సీపీఐలో చేరారు. రెండు సార్లు నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికై ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించారు. 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.