తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు బాధ్యతలు చేపట్టారు. రేసులో ప్రముఖలు ఉన్నా.. ఊహించని విధంగా రాంచందర్ రావును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపికపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. రాంచందర్ రావు ఎంపిక వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డీల్ జరిగిందని.. అందులో భాగంగానే రాంచందర్ రావును బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు మల్లన్న ఆరోపించారు.