మరికొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ మొదలు కానుంది. తుదిపోరులో విజేతగా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా తహతహలాడుతోంది. మరోవైపు ఫైనల్లో టీమిండియాకు షాక్ ఇవ్వాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం సాధించాలని కోరుకుంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. అలాగే హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచులు ఆడుతున్న మహిళల హాకీ జట్టు కూడా గెలవాలని కోరుకున్నారు.