ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విలేకర్లతో చిట్ చాట్ ముచ్చటించిన నారా లోకేష్.. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్ చేరితే మ్యాచ్ చూడటానికి కచ్చితంగా వెళ్తానన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రావాలని అనుకుంటే ఆయనకు కూడా టికెట్ తీస్తానని.. జగన్ను కూడా ఫైనల్ మ్యాచ్కు తీసుకెళ్తానని అన్నారు. నారా లోకేష్ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి వెళ్లటంపై టీడీపీ, వైసీపీ మధ్య ఇటీవల ట్వీట్ల వార్ జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఈ సెటైర్లు వేశారు.