తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వీలైనంత త్వరలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదల చేసి.. మే నెలలో పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తల్లికి వందనం పథకం పేరుతో నెల్లూరు జిల్లా కావలిలో ఓ మహిళను మోసం చేశారు. తల్లికి వందనం పేరుతో ఫోన్ చేసిన ఆగంతకుడు మహిళ నుంచి 71 వేల రూపాయలు కాజేశాడు. ఈ ఘటనపై సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.