Telangana: 9.5 లక్షల మంది రైతులకు పండగే.. హైకోర్టు కీలక ఆదేశాలు

1 year ago 18
తెలంగాణలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది. ఈ భూముల రెగ్యులేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం 2020 అక్టోబరులో జారీ చేసిన జీవోపై స్టే తొలగించింది. భూభారతి చట్టంలో క్రమబద్ధీకరణ అంశాన్ని పొందుపరచడంతో కోర్టు అనుమతినిచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలోని దాదాపు 9.5 లక్షల మంది రైతులకు ఊరట లభించనుంది. రిజిస్ట్రేషన్ లేని భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article