మూడురోజుల పాటు సాగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టకేలకు ఫలితం తేలింది. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అంజిరెడ్డి విజయం సాధించారు.