తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మించనున్నారు. రూ. 1083 కోట్లతో 1.77 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ వంతెన, ప్రమాదకరమైన పడవ ప్రయాణాలకు ముగింపు పలికి, ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను సులభతరం చేయనుంది. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.