తెలంగాణలో సవరించిన భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్ల నూతన మార్కెట్ విలువలు శుక్రవారం (జూన్ 5) నుంచి అమల్లోకి వచ్చాయి. 17 జిల్లాల్లోని 66 గ్రామాల్లో వ్యవసాయ భూముల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పుప్పాలగూడ, చేవెళ్ల, కందుకూరులలో భూముల విలువలు భారీగా పెరిగాయి. పలు ప్రాంతాలలో 15 శాతం నుంచి 25 శాతం వరకు మార్కెట్ విలువలు పెరిగాయి. వాణిజ్య భవనాల గ్రౌండ్ ఫ్లోర్ విలువలలో 11 శాతం తగ్గింపు ఇవ్వగా.. నివాస అపార్టుమెంట్లు, ఓపెన్ ప్లాట్ల ధరలను డిమాండ్ను బట్టి చదరపు అడుగు, గజాల వారీగా సవరించారు.