హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 త్వరలో హై సెక్యూరిటీ స్మార్ట్ రోడ్డుగా రూపాంతరం చెందనుంది. ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తారు. మల్కాపూర్ నుంచి కనకదుర్గమ్మ దేవాలయం వరకు 231 కి.మీ మేర విస్తరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానించబడిన 231 అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి 24 గంటలు నిఘా ఉంచుతాయి. దీని అంచనా వ్యయం రూ. 10,391 కోట్లు. రహదారిపై సోలార్ వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కూడా కల్పిస్తారు.