తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే చేపట్టింది. ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారో లేదో తెలుసుకోవడానికి గత నాలుగు నెలల కరెంట్ బిల్లులను అధికారులు విశ్లేషిస్తున్నారు. 50 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లలో ఎవరూ నివసించడం లేదని గుర్తించారు. అలాగే.. నిబంధనలకు విరుద్ధంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్న వందలాది మందికి ఇళ్లు దక్కినట్లు సర్వేలో తేలింది. అనర్హుల నుంచి ఈ ఇళ్లను స్వాధీనం చేసుకుని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిజమైన పేదలకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించనున్నారు.