తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి, కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు) నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ నియామకాలు జరుగుతున్నాయి. పొరుగు సేవల విధానంలో నియమితులయ్యే వీరికి నెలకు రూ. 15,000 గౌరవ వేతనం అందిస్తారు. ఈ నియామకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకు కొత్త ఊపు రానుంది.