TG: ఫోన్ ఇచ్చిన పాపానికి.. రూ.91 వేలు టోకరా.. రైల్వేస్టేషన్‌లో ఏం జరిగిందంటే..

7 months ago 15
మెదక్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి వద్ద నుంచి ఫోన్ తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తి సిమ్ కార్డును మార్చేసి రూ. 91,500 అపహరించాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన నీలం రెడ్డి అనే బాధితుడు దగ్గర గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మాట్లాడాలని చెప్పి మొబైల్ తీసుకొని అసలు సిమ్‌ను దొంగిలించి.. ఆన్‌లైన్ ద్వారా నగదు చోరీ చేశాడు. ఈ సంఘటనపై మెదక్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి ఫోన్లు ఇవ్వరాదని సీఐ మహేష్ హెచ్చరించారు.
Read Entire Article