ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండియన్ రైల్వే చర్లపల్లి, హైదరాబాద్ నుంచి మొత్తం 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లు సోమవారం (రేపు) నుంచి నడవనున్నాయి. ముఖ్యంగా చర్లపల్లి – యలహంక, చర్లపల్లి – షాలిమార్, చర్లపల్లి – హెచ్. నిజాముద్దీన్ మధ్య .. హైదరాబాద్ – కొట్టాయం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు స్టేషన్ల మీదుగా కూడా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు టికెట్ల కోసం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రైల్వేశాఖ కల్పించింది.