టీజీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.కోటి ప్రమాద బీమా అమలు చేస్తుండగా.. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) సహకారంతో సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ఉచిత బీమాను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకం ద్వారా సుమారు 38 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. ఉద్యోగి మరణించిన పక్షంలో వారి కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించనుంది.