తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి డీఏ ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ సిబ్బందికి 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.3.6 కోట్ల భారం పడుతుందని అయినా కార్మికుల సంక్షేమం కోసం డీఏ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.