హైదరాబాద్లో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ సేవా పథకం కింద మంజూరు చేయడంతో, మౌలిక సదుపాయాల కోసం రూ. 392 కోట్లు కేటాయించాలని కోరింది. డీజిల్ బస్సుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు, 2026 మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.