తెలంగాణలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ముగిసింది. సర్కార్తో జరిపిన చర్చలు సఫలం కావటంతో కార్మికులు సమ్మె విరమించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ 11 శాతం పీఆర్సీ, ప్రభుత్వంలో సంస్థ విలీనంపై విధివిధానాల కమిటీ ఏర్పాటు, గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకరించింది. ప్రభుత్వ సానుకూల నిర్ణయంతో కార్మికులు సమ్మె విరమించి ఇవాళ (శనివారం) ఉదయం నుండి విధుల్లో చేరారు.