తెలంగాణలోని దివ్యాంగ పురుషులకు సర్కార్ తీపి కబురు అందించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ జర్నీ కల్పిస్తుండగా.. తాజాగా దివ్యాంగ పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.