టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి ఇస్తామని దీనికి ‘భూ లక్ష్మి పథకం’ అని పేరు పెట్టారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన కవిత.. పేదల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.