ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 'వాట్సాప్ చాట్బాట్' ఫీచర్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, బస్సులను ట్రాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. ముందుగా ఈ సేవలను హైదరాబాద్లోని పుష్పక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభిస్తారు. ఇది విజయవంతమైతే ఇతర బస్సులకు కూడా విస్తరించనున్నారు. ఈ ఫీచర్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.