హైదరాబాద్ను పర్యావరణహితంగా మార్చేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తోంది. కేంద్రం 'పీఎం-ఈ డ్రైవ్' కింద 2 వేల ఈ-బస్సులను హైదరాబాద్కు మంజూరు చేసింది. అయితే.. టెండర్ షరతులు పాటించకపోవడం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో జాప్యం, బస్సుల డెలివరీ ఆలస్యం వంటి సమస్యలున్నాయి. ఈవీల పనితీరు మెరుగుపరచాలని.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి తెలిపారు.