నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్లలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు బస్సుకు నిప్పు పెట్టడంతో కలకలం రేగింది. తాగుబోతులు లేదా గంజాయి బ్యాచ్ పని అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ దారుణానికి కారణమెవరు? వారి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ చర్య కారణంగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.