టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. విశాఖకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు రూ.70 లక్షలు విరాళం అందించారు. విశాఖకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం దంపతులు రూ.50 లక్షలు, వారి కుమారులు రూ.20 లక్షలు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. దాతల తరఫున వారి ప్రతినిధి టీటీడీ ఏఈవోను కలిసి విరాళానికి సంబంధించి చెక్కు అందించారు.