AP Cabinet setup Inquiry commission on Tirumala laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తిరుమల లడ్డూ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మంత్రులు మీడియాకు వెల్లడించారు.