Tirumala Nri Darshan Process Rules Changed: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎన్ఆర్ఐలు కూడా వస్తుంటారు. వారికోసం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పిస్తోంది. ఇండియాకు వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు 30 రోజుల్లోపు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటి వరకు 30 రోజులు వరకు ఉన్న గడువును 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో ఎన్ఆర్ఐలకు భారీ ఊరట దక్కింది.