తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే హిందూయేతర ఉద్యోగులకు గుర్తించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటింటి తనిఖీలు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో కొందరు అన్యమతస్థులు టీటీడీలో చేరడంతో వివాదం నెలకొంది. అలాగే ప్రస్తుతం కొందరు ఉద్యోగులు ఇతర మతాల్లోకి మారారని ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించారు. అయితే ఇంటింటి తనిఖీల అంశం జూలై 22న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.