తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఫోటో స్టూడియో యజమాని మధ్య గొడవ జరిగిందన్న వార్తలపై టీటీడీ స్పష్టతనిచ్చింది. లైసెన్స్ లేకుండా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ను సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ ఆస్థాన మండపంలోని ఫోటో స్టూడియో వద్ద గొడవపడ్డారు. సెక్యూరిటీ గార్డు ప్రవర్తన సరిగా లేనందున అతడిని విధుల నుంచి తొలగించినట్లు టీటీడీ తెలిపింది. వాస్తవాలను వక్రీకరించడం సరికాదని సూచించింది.