Tirumala: కుంభమేళాకు వెళ్లిన టీటీడీ ఉద్యోగి అదృశ్యం కావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. మహా కుంభమేళా సందర్భంగా.. ప్రయాగ్రాజ్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉండే నమూనా ఆలయాన్ని అక్కడ టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన ఒక టీటీడీ ఉద్యోగి బుధవారం నుంచి కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయగా.. ఆ ఉద్యోగిని వెతికే పనిలో పోలీసులు పడ్డారు.