Tirumala: కొండ కింద ఇదో దందా..! శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన

1 year ago 39
Divya darshan tokens at srivari mettu: తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలు సెలవులు కావటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో కొండపై రద్దీ నెలకొంది. మరోవైపు శ్రీవారిమెట్టు మార్గం నుంచి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే దివ్య దర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ శనివారం శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులు ఆందోళనకు దిగారు. ఆటో డ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కలిసి దందా సాగిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఈవో దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Entire Article