ఫోన్పేలో లంచం తీసుకుంటూ.. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ఉద్యోగికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఒకసారి ఫోన్పేలో డబ్బులు చెల్లించగా.. మరోసారి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఆ ఉద్యోగిని పట్టుకున్నారు. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.