గ్యాస్ కొరత ఇప్పుడు దేశం మొత్తాన్ని వేధిస్తోంది. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత ప్రభావం ద్వారకా తిరుమలను తాకింది. నిత్యం చిన్న వెంకన్న ఆలయంలో అన్నదానం, ప్రసాదాల తయారీకి గ్యాస్ను వినియోగిస్తుండగా.. ఇప్పుడు సిలిండర్ల కొరతతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్నదానం, ప్రసాదాల తయారీకి గ్యాస్కు ప్రత్యామ్నాయాలుగా కట్టెలతో స్టీమ్ను ఉత్పత్తి చేసి దాని నుంచి వంటలు చేయనున్నారు.