TTD Trust board meeting Decisions: అన్నమయ్య భవన్లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడం సహా పలు కీలక తీర్మానాలు చేశారు. అందులో భాగంగా టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఓసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.