తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే అన్న ప్రసాద వితరణ కూడా తిరిగి ప్రారంభమైంది. లడ్డూ కౌంటర్లు కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చారు.