కలియుగం వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ ఈ మార్పులు చేసింది. గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ కొత్త విధానం ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది విజయవంతమైతే.. తర్వాత కొత్త విధానం కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.