Tirupati Auto Drivers Attack On Devotees: తిరుపతిలో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒంగోలుకు చెందిన భక్తులు శ్రీనివాసమంగాపురం వెళ్లడానికి ఆటో మాట్లాడుతుండగా ఛార్జీలపై గొడవ జరిగింది. రాపిడో ఆటోలో ఎక్కువ మంది ఎక్కడంతో ఆటో డ్రైవర్ సమీర్ ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం జరిగి, ఆటో స్టాండ్ అధ్యక్షుడితో సహా డ్రైవర్లు భక్తులపై దాడి చేశారు. పోలీసులు సమీర్ను అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశారు.