క్షణికావేశంలో యువత ఆత్మహత్యలు చేసుకుని.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు. ఒత్తిడిని జయించలేక కొందరు.. వ్యక్తిగత కారణాలతో ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడి తీరని వేదన మిగుల్చుతున్నారు. తాజాగా, ఓ యువకుడు ఇలాగే తనవు చాలించాడు. అతడికి ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదు గాానీ.. తాను ప్రయాణిస్తున్న బస్సులోనే మరణ శాసనం రాసుకున్నాడు. చివరి సీటులో కూర్చున్న అతడు.. బస్సులో ముగ్గురు ప్రయాణికులే ఉండటంతో వెనుక హ్యాంగర్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.